నేటి నుంచి అనంత‌ పద్మనాభ స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి..!

-

కరోనా కారణంగా 5 నెలలుగా మూతపడ్డ తిరువనంతపురంలోని‌ అనంత‌ పద్మనాభ స్వామి ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. లాక్‌డౌన్ నేప‌ధ్యంలో మార్చి 21 నుంచి ఆలయంలోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌లేదు. అయితే కరోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 8 గంటల నుంచి11 గంటల వరకు.. మళ్లీ తిరిగి సాయంత్రం 5 నుంచి సాయంత్రం దీపారాధన సమయం వరకూ పద్మనాభస్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందు రోజు సాయంత్రం 5 గం.కు ఆన్‌లైన్‌లో త‌మ పేరు న‌మోదు చేయించుకోవాలని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో గరిష్టంగా 665 మంది భక్తుల‌ను మాత్రమే అలయంలోకి అనుమతించనున్నారు. అదేవిధంగా 10 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులుగా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news