మంత్రి కుమార్తె ప్రేమ వివాహం… తండ్రికి భయపడి పోలీసులను ఆశ్రయించిన జంట

-

అచ్చం సినిమాల్లో లాగే జరిగింది. రాజకీయ నాయకుడి కుమార్తె సాధారణ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. సేమ్ అలాగే తమిళనాడు రాష్ట్రానికి మంత్రి అయిన శేఖర్ బాబు కుమార్తె కూడా ప్రేమ వివాహం చేసుకుంది. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది. 

మంత్రి శేఖర్ బాబు కుమార్తె జయకళ్యాణి..సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. సోమవారం బెంగళూర్ లో సతీన్ ను పెళ్లి చేసుకుంది. అక్కడి నుంచి నేరుగా సిటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. సతీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. రెండు నెలల క్రితం నన్ను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. తమిళనాడు పోలీసులు సతీష్ ను నిర్భందించారని.. తమిళనాడుకు వస్తే చంపేస్తామంటూ.. బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది జయకళ్యాణి. మేమిద్దరం మేజర్లమని.. మా పెళ్లి ఇద్దరి ఇష్టపూర్వకంగానే జరిగిందని పేర్కొంది. మంత్రి శేఖర్ బాబు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు.

Read more RELATED
Recommended to you

Latest news