దొంగతో కలిసి భోజనం చేసిన సీఎం.. నెటిజన్లు ఫైర్

-

సాధారణంగా ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు సామాన్యులతో కలిసి విందు ఆరగిస్తారు. ప్రజలను ఆకర్షించే ఆ ప్రయత్నంలో తమతో కలిసి భోజనం చేస్తుంది ఎవరనేది గుర్తు పట్టరు. అలాంటి పరిస్థితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్​కు ఎదురైంది. ఓ కార్యక్రమంలో భాగంగా విందులో పాల్గొన్న సీఎం పక్కన.. ఏకంగా ఓ దొంగ కూర్చున్నాడు. ఈ విషయం తెలియక ఆ ముఖ్యమంత్రి దొంగతో ముచ్చటిస్తూ అతడి భుజం తట్టారు. ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సోమవారం రోజున సిద్ది జిల్లాలో పర్యటించారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలతో కలసి విందులో పాల్గొన్నారు. ఆ సమయంలోనే భద్రత సిబ్బంది కళ్లుగప్పి అరవింద్​ గుప్తా అనే కలప దొంగ అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ దొంగ సీఎం పక్కనే కూర్చుని విందు ఆరగించాడు. ఇది తెలియని సీఎం అతడితో ముచ్చటిస్తూ భోజనం చేశారు. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .

Read more RELATED
Recommended to you

Latest news