Mahesh Babu : తల్లి చితాభస్మాన్ని గంగా నదిలో కలిపిన మహేష్

-

గత వారం టాలీవుడ్‌ హీరో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్య సమస్యలతో మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే.. మహేష్ బాబు తల్లి మరణం..పట్ల పవన్ కళ్యాణ్, చిరుతో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.


అయితే.. తన తల్లి ఇందిరా దేవి చితా భస్మాన్ని మహేష్‌ బాబు తాజాగా గంగా నదిలో కలిపారు. ఆదివారం హరిద్వార్‌ వెళ్లిన ప్రిన్స్‌ మహేష్ బాబు.. పవిత్ర గంగా నదీ ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం తన తల్లి ఇందిరా దేవి చితా భస్మాన్ని గంగా నదిలో కలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news