బ్యాంకు కుంభకోణం లో చిక్కుకున్న మహేష్ బాబు ..!?l

-

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత అతడు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాపై ఫాన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ ఏడాది గ్యాప్ తర్వాత `సర్కారు వారి పాట` సెట్స్ లో జాయిన్ కానున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ జనవరిలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ నిర్మాణం సాగుతోంది. నిజానికి ఈ మూవీ మెజారిటీ షూటింగ్ అమెరికాలో చేయాల్సి ఉండగా.. తాజా కరోనా మహమ్మారీ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా షెడ్యూల్ ని వాయిదా వేశారు. ఈలోగానే హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో నిర్మిస్తున్న భారీ సెట్లో చిత్రీకరణకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇంతకీ ఈ షూట్ లో ప్రాధాన్యత ఏమిటి అంటే.. ఈ మూవీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం కొంత భాగాన్ని బ్యాంకులో చిత్రీకరించాలి. బ్యాంక్ ఇన్ సైడ్ అవసరమైన ఎపిసోడ్స్ ని ఫిల్మ్ సిటీలో ప్రత్యేక బ్యాంక్ సెట్ లోనే పూర్తి చేస్తారు.అటుపై అమెరికా వెళ్లి అక్కడ బ్యాంక్ వెలుపలి సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ రెండూ మూవీలో చాలా కీలకం. మెజారిటీ షూట్ బ్యాంకులోనే ఉంటుంది. ఒక రకంగా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో పరశురామ్ చక్కని ప్రయోగాన్ని ఎంచుకున్నారనే అర్థమవుతోంది.దీని తర్వాత వెంటనే అమెరికాకు పయనం అవుతుందట చిత్ర యూనిట్. చికాగోలో జరపబోయే రెండో షెడ్యూల్‌లో మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారని సమాచారం. అక్కడి కాసీనో సెంటర్లలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారని వినికిడి

ఈ సినిమాలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్లిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news