” మేజర్” నేను గర్వపడే సినిమా: ప్రకాష్ రాజ్

-

విలక్షణ నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ నటించిన తాజా చిత్రం” మేజర్” విడుదలకు సిద్ధమవుతుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడివి శేష్ టైటిల్ రోల్ ను పోషించారు. హీరో మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 3వ తేదీన తెలుగుతోపాటు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇది హృదయాన్ని హత్తుకునే సినిమా అని, ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అన్నారు. “ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ భార్య పాత్రలో రేవతి నటించగా.. అడివి శేష్ సరసన కథానాయికగా నయీ మంజ్రేకర్ అలరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news