గుర్తుపెట్టుకోండి.. దేశాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీయే : మల్లికార్జున ఖర్గే

-

గుర్తుంచుకోండి.. దేశాన్ని రక్షించేది.. స్వాతంత్య్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గాంధీ త్యాగం, నెహ్రూ పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని మోదీ విమర్శిస్తున్నారని.. తాము ఏమీ చేయలేకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని విమర్శించారు.  మంచిర్యాలలో ఏర్పాటు చేసిన జై భారత్​ సత్యాగ్రహ సభలో ఖర్గే పాల్గొన్నారు.

కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలు మూసివేస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గాలిని అమ్మే శక్తి ఉంటే అది కూడా అమ్మేవారని ఎద్దేవా చేశారు.

ఎస్సీల పేరు చెప్పుకుని కొందరు పబ్బం గడుపుతున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పేదల అవసరాలు తీర్చడం మాత్రం చేతకాదని అన్నారు. దళితుల కోసం కాంగ్రెస్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిదని గుర్తు చేశారు. వారి కోసం తెలంగాణ  ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని  ఖర్గే డిమాండ్ చేశారు. ఎస్సీల విషయమై పత్రికల్లో ప్రకటనలు ఇస్తే సరిపోదని మల్లికార్జు ఖర్గే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news