కోడలికి షాక్ ఇచ్చిన దేవెగౌడ.. హసన్ టికెట్ స్వరూప్ కే

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల మధ్య రాజకీయాలే కాకుండా కుటుంబ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో హసన్ నియోజవర్గ టికెట్ ఆశించిన కోడలు భవానికి జేడీఎస్ అధినేత దేవెగౌడ షాక్ ఇచ్చారు.

భవానీ రేవన్న పోటీ చేయాలనుకున్న హసన్​ నియోజకవర్గానికి హెచ్​పీ స్వరూప్​ను అభ్యర్థిగా ఖరారు చేశారు. హసన్​ సహా కర్ణాటకలోని 49 స్థానాలకు దేవెగౌడ  అభ్యర్థుల పేర్లను  ప్రకటించారు. ఈ పరిణామం.. దేవెగౌడ కుటుంబ రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది.

కర్ణాటకలోని 224 శాసనసభ నియోజకవర్గాలకు.. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి అనేక నెలల ముందే.. 2022 డిసెంబర్​లో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది జేడీఎస్​. మొదటి విడతలో 93 మంది పేర్లు ఖరారు చేసింది. ఈ నెల 4నే రెండో జాబితా వస్తుందని తొలుత అంతా భావించారు. అయితే.. భవానీ రేవన్నకు టికెట్ ఇవ్వడంపై దేవెగౌడ కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫలితంగా టికెట్ల కేటాయింపు ఆలస్యమైనట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news