గణపతి మండపం వద్ద విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం

-

గణపతి నవరాత్రులు ఊరూరా చాలా వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే,గణపతి మండలం వద్ద క్లీనింగ్ చేసేందుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలం రాజ్ పేటలో సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. రాజ్ పేటకు చెందిన దాసరి పోచయ్య (60) గ్రామపంచాయలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే నేటి ఉదయం గ్రామంలో పారిశుధ్య పనులు చేస్తుండగా అక్కడే ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్దకు వచ్చాడు.

ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన జేవైర్‌ను పక్కన పెట్టేందుకు ముట్టుకోగా అది షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే పోచయ్య మృతి చెందాడు. విషయం తెలియడంతో గణపతి మండపం నిర్వాహకులు, గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.వారు స్పాట్‌కు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news