కేరళలో ఆశ్చర్యకర ఘటన.. ఇడ్లీ తింటూ వ్యక్తి మృతి

-

కేరళలో ఓ ఆసక్తికర, ఆశ్యర్యకరమైన  సంఘటన చోటు చేసుకుంది. ఇడ్లీ తింటూ ఓ వ్యక్తి మరణించాడు. వాస్తవానికి ఆ వ్యక్తి అతిగా ఇడ్లీలను తినడం వల్లనే చనిపోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..   కేరళలోని వలయార్ లో శనివారం ఓ పండుగ సందర్భంగా ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 49 ఏళ్ల వ్యక్తి పాల్గొని మరణించినట్టు పోలీసులు తెలిపారు. పోటీలో పాల్గొన్న సమయంలో సురేష్ అనే వ్యక్తి ఇడ్లీ తింటుండగా ఊపిరాడకపోవడంతో ప్రేక్షకులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు.

ఎలాగోలా గొంతులోంచి ఇడ్లీని బయటకు తీశారు. కానీ సురేష్ ఆరోగ్యం క్షీణించడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్టు వెల్లడించారు పోలీసులు. ఈ ఘటన పై వాళార్ పోలీసులు అసమజ మరణంగా కేసు నమోదు చేశారు. ఇటీవలే జార్ఖండ్ లో ఆహారం కారణంగా వ్యక్తి, తూర్పు సింగ్ భూమ్ లో రసగుల్లా తింటూ యువకుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలన్నింటిలో ఆహార పదార్థాలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మరణించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news