రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి రూ.10వేలు : మంత్రి పొంగులేటి

-

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతుల బాధలు వర్ణణాతీతం. తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం కింద ఒక ఎకరానికి రూ.10వేల చొప్పున అందించనుంది. అత్యంత త్వరలోనే అందించనున్నట్టు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 

ముఖ్యంగా ప్రకృతి విపత్తులు జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రతీ పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తామన్నారు. వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన వారి ఖాతాల్లో ఎకరానికి రూ.10,000 చొప్పున త్వరలోనే జమ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రూ.10వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news