ఈయన మామూలోడు కాదు.. 15 నిమిషాల్లో 75 చేప ముక్కలు లాగించేశాడు

-

బిహార్‌లోని పట్నాలో ఓ వింత పోటీ జరిగింది. అదేంటంటే.. చేపలు తినే పోటీ. ఈ పోటీలో ఓ వ్యక్తి కేవలం 15 నిమిషాల్లో 75 చేప ముక్కలను తిని రూ.10 వేల నగదును బహుమతిగా పొందాడు. చేపల విక్రయాలను పోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర జాలర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. చాలా మంది ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

మదన్‌ కుమార్‌ అనే చేపల వ్యాపారి ఇలా 15 నిమిషాల్లో 75 చేప ముక్కలను తిని మొదటి విజేతగా నిలిచారు. పరాస్ అనే వ్యక్తి మొత్తం 73 చేపముక్కలను తిని రెండో స్థానంలో నిలిచాడు. ఇతనికి రూ.5వేల బహుమతి లభించింది. రాజ్‌సాహ్ని, జై కుమార్ ఝా అనే ఇద్దరు వ్యక్తులు.. చేరో 60 చేప ముక్కలు తిని మూడో స్థానంలో నిలిచారు. వీరికి రూ.2500 బహుమతి లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news