భార్యపై అనుమానం.. షూ లేస్‌తో కుమారుడికి ఉరేసి చంపిన తండ్రి

-

భార్యపై అనుమానంతో ఆరేళ్ల కుమారుడిని అతి దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. షూ లేస్​తో ఉరేసి చంపాడు. అనంతరం కుమారుడి మృతదేహాన్ని చెరకు తోటలో పడేసి ఏం ఎరగనట్టు కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ​ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సంభాల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

సంభాల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ధర్మేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించిన ధర్మేష్.. నిత్యం ఆమెతో గొడవ పడేవాడు. కుమారుడిని క్రూరంగా కొట్టేవాడు. జనవరి 5న కుమారుడిని చంపి చెరకు తోటలో పడేశాడు. మరుసటి రోజు కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ చేసి.. ధర్మేష్​యే తన కుమారుడిని హత్య చేసినట్లుగా తేల్చారు. అతడిని అరెస్టు చేసి.. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news