కల్వకుంట్ల కవితపై ఠాగూర్ సంచలన ట్వీట్

-

కల్వకుంట్ల కవితపై ఠాగూర్ సంచలన ట్వీట్ చేశారు. . తెలంగాణ ఆడ బిడ్డలను వేధిస్తున్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పై చర్యలు తీసుకోవాలని… కెసిఆర్ కూతురు కవిత డిమాండ్ చేయగలరా..? అని నిలదీశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత కు ట్యాగ్ చేశారు టాగూర్‌. ఖమ్మం లో కాంగ్రెస్ నాయకులపై మంత్రి పువ్వాడ అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని ఆగ్రహించారు.

 

కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు ఆపకపోతే… మంత్రి పువ్వాడ హాస్పిటల్ మమతా ఆసుపత్రి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత ముస్తఫా..కార్పొరేటర్ రఫియ భేగం, కార్పొరేటర్ మంజుల భర్తల నరేందర్ ల పై కేసులు పెట్టారని ఠాకూర్‌ ఆగ్రహించారు.

ఆ రెండు కుటుంబాలు పువ్వాడ వేధింపులతో ఖమ్మం లో బతికే పరిస్థితి లేదని… పిడి ఆక్ట్ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా… మళ్ళీ వేదింపులు గురి చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఇద్దరు పోలీసులు..టీఆర్‌ఎస్‌ పార్టీ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని.. ఆ ఇద్దరు అక్రమ కేసులు పెట్టే పనిలోనే ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news