హైదరాబాద్ పర్యటనలో మాణిక్‌రావు ఠాక్రే ఐక్యతా రాగం

-

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ గా తొలిసారి హైదరాబాద్ వచ్చారు మాణిక్ రావు ఠాక్రే. రెండ్రోజుల హైదరాబాద్ పర్యటనలో ఠాక్రే ఐక్యతా రాగం వినిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పార్టీ నేతలందరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు. గాంధీభవన్​లో పీఈసీ, జిల్లా అధ్యక్షుల భేటీ ముగిసింది.

‘ఈ రెండు రోజులు నేను రాష్ట్ర నేతలను కలిశాను. మొదటి సారి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చాను. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశాను. రెండు రోజులు జరిగిన సమావేశాల్లో పాల్గొన్న నేతలు సూచనలు చేశారు. వాటిని నేను విన్నాను. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసి పని చేసి విజయం సాధిస్తాం.’-మానిక్‌రావ్‌ ఠాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌

Read more RELATED
Recommended to you

Latest news