మాణిక్యాలరావు అంత్యక్రియలు పూర్తి.. సోము వీర్రాజు కంటతడి..!

-

అధికార లాంఛనాలతో మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశానవాటికలో పూర్తయ్యాయి. మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. మాణిక్యాలరావు కుటుంబానికి పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలిపారు. సహచరుణ్ణి కోల్పోయానని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని కంటతడి పెట్టుకున్నారు.

బీజేపీకి మాణిక్యాలరావు మృతి తీరని లోటని సోము వీర్రాజు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డీఎస్పీ కె.రాజేశ్వర రెడ్డి, ఆర్డీవో రచన, పోలీసు అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news