తెలంగాణలో మాణిక్యం ఠాగూర్ పాదయాత్ర..!

-

నవంబర్ 1 వ తేదీ నుంచి డిజిటల్ మెంబర్ షిప్ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గాంధీ భవన్ లో నుంచే రేపు ఉదయం ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు మనిక్కమ్ ఠాగూర్. మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ, మరియు మండల అధ్యక్షుల సమావేశం ఇవాళ జరిగినది.

ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న దోపిడీ, అరాచకాల పై నవంబర్ 14 వ తేదీ నుంచి 21 వరకు 7 రోజుల పాటు నారాయణ పేటలో జన జాగరణ పేరు తో పాదయాత్ర నిరహిస్తామని ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news