నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలి గాల్లో ఎగురుతూ రోడ్డుకు మరోవైపు పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. వీరంతా హైదరాబాద్ నివాసులని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news