కడలిలో కళ్యాణం.. తమిళనాడులో వింత పెళ్లి !

-

అందరిలో కళ్యాణమండపంలో బాజా భజంత్రీల మధ్య పెళ్లి చేసుకుంటే కిక్ ఏముంది అని అనుకున్నారో ఏమో ఏకంగా సముద్రం మధ్యలో అదికూడా సముద్రగర్భంలో పెళ్లి చేసుకున్నారు తమిళనాడుకు చెందిన ఒక జంట. దీంతో ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తమిళనాడులోని తిరువణ్ణామలై కి చెందిన చిన్నదురై, కోయంబత్తూరు జిల్లాకు చెందిన శ్వేతకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరిద్దరూ చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ తమ పెళ్లిని కాస్త వింతగా జరుపుకోవాలని భావించారు.

సముద్రపు అడుగున పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికొడుకు చిన్నదురై పుదుచ్చేరికి వెళ్లి స్కూబా డైవింగ్‌ శిక్షణ కళాశాల నడిపే తన స్నేహితుని వద్ద ఇద్దరూ శిక్షణ పొందారు. నిన్న ఉదయం చెన్నై సమీపంలోని సముద్రంలో ఒక పడవలో అలలపై ప్రయాణిస్తూ లోపలి వెళ్ళారు. అక్కడ వధూవరులిద్దరూ ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చిన స్కూబా డైవింగ్‌ డ్రస్సును ఇద్దరు వేసుకుని సముద్రంలోకి దూకారు. సముద్రపు అడుగు భాగంలో ఉండే మొక్కల మధ్య పూలతో అలంకరించి ఉన్న వివాహవేదిక వద్దకు చేరుకుని అక్కడే ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ తరువాత పెళ్లికుమారుడు చిన్నదురై పెళ్లికుమార్తె శ్వేత మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత ఇద్దరూ పైకి వచ్చి తీరానికి చేరికున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news