భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు…తెలంగాణకు ఆరెంజ్‌ హెచ్చరిక

-

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ఊపిరి బిక్కిరి అవుతున్నారు. మొన్నటివరకు చల్లటి గాలులు మధ్య ఉన్న తెలంగాణ ప్రజలు.. ఇప్పుడు వేడి గాలులకు తట్టు కోలేకపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అని.. ఆ ప్రాంత ప్రజలు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయట తిరగకూడదు అని పేర్కొంది.

అలాగే ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. చత్తీస్ఘడ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు 1500 మీటర్ల ఎత్తున ఉత్పత్తి ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. దీని ప్రభావంతో పగలు కొన్ని చోట్ల స్వల్పంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలు అలర్ట్ గా ఉండాలని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news