బెంగళూరులో జగన్‌ తో వైసీపీ నేతల సమావేశం ?

-

Meeting of YCP leaders with Jagan in Bengaluru: బెంగళూరులో జగన్‌ తో వైసీపీ నేతల సమావేశం నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్లో మీడియా ఈ వార్తలను ప్రచారం చేస్తోంది. అయితే.. దీనిపై వైసీపీ పార్టీ స్పందించింది. టీడీపీ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీల్లో మరొక ఛానల్‌ చేరినట్టే కనిపిస్తోందని వైసీపీ ఆగ్రహించింది.. బెంగళూరులో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిగారు పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశం నిర్వహించలేదని వివరించింది.

Meeting of YCP leaders with Jagan in Bengaluru

సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి సహా నాయకులెవ్వరితో ఎలాంటి సమావేశాలు జరగలేదని తెలిపింది. కనీసం వారు బెంగళూరు కూడా రాలేదు. జరగని సమావేశాలకు కొందరికి మాత్రమే ఆహ్వానం అందినట్టుగా, మరికొందరికి ఆహ్వానం లేదన్నట్టుగా ఫేక్‌ వార్తలు ప్రసారం చేస్తున్నారు. దిగజారిపోతున్న మీ జర్నలిజానికి నిదర్శనంగా ఈ ఫేక్‌ వార్తలు నిలిచిపోతాయని ఆగ్రహించింది వైసీపీ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news