మెగా ఫాన్స్ :రీ రిలీజ్ కు సిద్ధమైన మగధీర..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారిగా సినీ చరిత్రలోనే రికార్డులను సైతం తిరగరాసిన చిత్రంగా పేరు పొందింది మగధీర సినిమా. ఈ సినిమాతో అటు రామ్ చరణ్, రాజమౌళి, కాజల్ అగర్వాల్ టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోయారు. ఇక రామ్ చరణ్ రెండవ సినిమాకి సినీ ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాశారు.ముఖ్యంగా ఇందులోనే డైలాగులు, పాటలు ,ఇప్పటికి అభిమానుల సైతం ఇష్టపడుతూ ఉంటారు. ఈ సినిమా 2009 జులై 31న విడుదలైయింది.

దాదాపుగా 13 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సూపర్ హిట్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ఈ సినిమాని థియేటర్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మరొకసారి మగధీర సినిమాను థియేటర్లో చూసేందుకు కూడా అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉండడంతో.. మగధీర సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కించారు. కీలకమైన పాత్రలో శ్రీహరి కూడా నటించి మెప్పించారు.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. అలాగే ఏఎం రత్నం మాటలు రాయగా ఈ సినిమాలోని పాటలు భువనచంద్ర చంద్రబోస్ కీరవాణిలో సమకూర్చారు. ఈ చిత్రం దాదాపుగా రూ.40.42 కోట్ల రూపాయలతో థియేట్రికల్ బిజినెస్ జరగగా.. దాదాపుగా ఈ సినిమా మొత్తం రూ.77.96 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక దీంతో ఈ సినిమాకు ఉన్న బయ్యర్లకు రూ.37.54 కోట్ల రూపాయలు లాభాన్ని తెచ్చింది. మరి రిలీజ్ లో కూడా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version