Breaking : గంటపాటు నిలిచిపోయిన మెట్రో రైళ్లు

-

అంతరాయం కారణంగా మెట్రో సేవలు గంటపాటు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైల్‌ సేవలకు ఇవాళ గంటపాటు
అంతరాయం ఏర్పడింది. మెడిసిన్‌ సరఫరా చేసే ఓ డ్రోన్‌ విఫలమై మెట్రో ట్రాక్‌ మీద పడిపోవడంతో రైళ్లను నిలిపేశారు. ఆ తర్వాత ట్రాక్‌పై నుంచి డ్రోన్‌ను తొలగించి రైలు సర్వీసులను పునరుద్ధరించారు అధికారులు. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు ఓ గంటపాటు అంతరాయం ఏర్పడింది.

Delhi Metro operations on Yellow Line to be partially curtailed tomorrow. See details | Mint

మెడిసన్‌ డ్రోన్‌.. షాహీన్‌ బాగ్‌-బొటానికల్‌ గార్డెన్‌ మార్గంలోని జసోలా విహార్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో ట్రాక్‌పై పడిందని, దాంతో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకుండా మెట్రో రైళ్లను గంటపాటు నిలిపేసి డ్రోన్‌ను తొలగించామని, ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news