MI vs DC : క‌ష్టాల్లో పంత్ సేన‌.. 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

-

ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు ముంబై ఇండియ‌న్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ తొలి ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టుకు 178 ప‌రుగుల టార్గెట్ ను అందించింది. 178 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంత్ సేన.. త‌డ‌బ‌డుతుంది. ఓప‌న‌ర్లు పృథ్వి షా (38), టిమ్ సీఫెర్ట్ (21) రాణించారు. అయితే త‌ర్వాతి బ్యాట్స్ మెన్లు వ‌రుస‌గా విఫ‌లం అవుతున్నారు. మ‌న్ దీప్ సింగ్ (0), పంత్ (1), రోవ్ మ‌న్ పావెల్ (0) తో పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు 72 ప‌రుగుల వ‌ద్దే 5 ప్ర‌ధాన వికెట్ల‌ను కోల్పోయింది. కాగ ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్లు బ‌సిల్ థంపి, మురుగ‌న్ అశ్విన్ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ముంబై ఇండియ‌న్స్ మొద‌టి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (41), ఇషాన్ కిషాన్ (81) ప‌రుగులు చేశారు. దీంతో ముంబై ఇండియ‌న్స్ నిర్ణ‌త 20 ఓవ‌ర్లో 177 ప‌రుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 178 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news