రాత్రికి రాత్రే డ్రీమ్ 11 ద్వారా కోటీశ్వరుడైన డ్రైవర్..

-

ఆన్ లైన్ బెట్టింగ్ డ్రీమ్ 11 వేదిక ద్వారా రూ. రెండు కోట్లు గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు బీహార్ కు చెందిన ఓ డ్రైవర్. శారణ్ జిల్లాలోని రసూల్ పూర్ కు చెందిన డ్రైవర్ రమేష్ కుమార్ ను ఈ అదృష్టం వరించింది. దీంతో అతడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.” ఆరంభంలో నేను రూ. 49 పెట్టి ఆడేవాడిని. కొన్నిసార్లు గెలిచే వాడిని, మరికొన్నిసార్లు నిరాశే ఎదురయ్యెది. ఇటీవలే పంజాబ్, లక్నో మధ్య మ్యాచ్ లో పంజాబ్ ని ఎంచుకున్నా.రూ.59 కి కెప్టెన్ గా కాగిసో రబాడ, వైస్ కెప్టెన్ గా శిఖర్ధావన్ ను ఎంచుకున్నా.

” అదృష్టం కొద్దీ ఆ మ్యాచ్ లో రబాడా మూడు వికెట్లు తీశాడు. అతడు ఎంపిక చేసుకున్న ఇతర క్రికెటర్లు కూడా బాగా ఆడడం వల్ల దేశ స్థాయిలో అతడికి మంచి పాయింట్లు లభించాయి. మ్యాచ్ జరిగిన తెల్లారి అతడు నెంబర్ వన్ స్థానంలో నిలిచి రూ.2 కోట్లు గెలిచుకున్నట్లు అతడికి సందేశం వచ్చింది. జిఎస్టి చెల్లింపుల అనంతరం అతడి ఖాతాలో రూ.1.4 కోట్లు వచ్చి చేరాయి. ఈ డబ్బుని తన పిల్లల చదువులకు, సమాజ శ్రేయస్సు కోసం వాడతానని రమేష్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news