జగన్ గురించి తెలిసి కూడా కొత్త అల్లరి అవసరమా జేసీ… ఫలితం వచ్చేసింది!

-

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. ఆ సామెత జేసీ బ్రదర్స్ ఎప్పుడూ చదువుకోలేదా లేక చదివినా ఒంటపట్టించుకోలేదా? వారు నాడు చదువుకోకున్నా.. చదువుకుని లైట్ తీసుకున్నా.. ఆ సామెతను ప్రాక్టికల్ గా అప్లై చేసి చూపిస్తున్నారు పోలీసులు! గత ప్రభుత్వం కాదు ఏమి చేసినా చెల్లడానికి.. ప్రతీ చర్యకూ ప్రతిచర్య ఉంటుంది.. చట్టం తనపని తాను చేసుకుంటూపోతుందని చెబుతున్నారు అధికారులు! ఫలితం… జేసీపై మరో కేసు!

ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత ఎక్కువ పలుకుబడి వస్తుంది.. అంత గొప్పగా చెప్పుకుంటారు అని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ… అన్నదమ్ములిద్దరూ పోటీలు పడి మరీ కేసులు పెట్టించుకుంటున్నారు! నోరు జారడం ఆలస్యం.. కేసులు పెడతారు! రూల్స్ అతిక్రమించడం ఆలస్యం లోపల వేస్తారు అని తెలిసినా కూడా.. మోడి ధైర్యంతోనో, మూర్ఖత్వంతోనో ముందుకు వెళ్తున్నారు!!

అవును.. తాజాగా టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్ ‌లో కేసు నమోదైంది. గనుల పర్మిట్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యంపై ఈ నెల 9న జేసీ దివాకర్ ‌రెడ్డి.. భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించిన సందర్భంగా నోటికి పనిచెప్పిన సంగతి తెలిసిందే! ప్రతీసారీ తన పాచికే పారాలని భావించో ఏమో కానీ… పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు! దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు!

ఈ విషయాలపై స్పందించిన తాడిపత్రి సీఐ తేజమూర్తి స్పందిస్తూ… జేసీ దివాకర్ రెడ్డి తనను బెదిరించారని, రెచ్చగొట్టేలా మాట్లాడారని.. దీంతో ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద ఎస్సై ప్రదీప్‌ కేసు నమోదు చేశారని తెలిపారు!! దీంతో… కేసుల విషయంలో అన్నదమ్ములిద్ధరూ పోటీలు పడుతున్నారనే కామెంట్లు తాడిపత్రి కేంద్రంగా బలంగా వినిపిస్తున్నాయి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news