రెండు జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు సీఎం లేడు : అంబటి

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్లీనరీ సమావేశాల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరులో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీకి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలు కాదు రెండు జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడంటూ ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు.

JanaSena will be extinct like Praja Rajyam: Ambati Rambabu

అంతేకాకుండా.. కాపులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎంను చేయడానికి తపన పడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు చిరంజీవి మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. కాపులు పవన్ కళ్యాణ్ ని నమ్మి వెళ్తే బంగాళాఖాతంలోకి వెళ్లినట్లేనని ఆయన సెటైర్లు వేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news