బండి సంజయ్ పిచ్చోడు – ఎర్రబెల్లి

-

బండి సంజయ్ పిచ్చోడు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి మెదడు లేదని ఎద్దేవా చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో వ్యవసాయానికి మోటర్లకు మీటర్లు పెట్టను అన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనన్నారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నారు ఎర్రబెల్లి.

మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. కొప్పుల ఈశ్వర్ ఒక మంచి వ్యక్తి అని.. ఈ నియోజకవర్గం ప్రజలు అతని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారి పైన ఉందన్నారు. ధరలు పెరిగాయి అంటే అది కేంద్ర ప్రభుత్వమే పెంచుతుందన్నారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందన్నారు. 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రెండు సంవత్సరాల కాలంలోనే కాలేశ్వరం పూర్తి చేసి 365 రోజులు నీళ్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు ఎర్రబెల్లి. 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news