తెలంగాణా అభివృద్ధిని గవర్నర్ అడ్డుకుంటోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి

-

తెలంగాణా అభివృద్ధిని గవర్నర్ తమిళి సై అడ్డుకుంటోందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. గవర్నర్ రాజకీయ ఉద్దేశంతోనే తెలంగాణ అభివృద్ధి అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని… తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా ప్రభుత్వం పంపిన బిల్లులపై సంతకాలు పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.


రాజ్ భవన్ పైరవీలకు కేంద్రం కాకూడదని… ప్రభుత్వం పంపిన బిల్లులలో లోపాలు ఉంటే తిప్పి పంపాలి.. అనుమానాలు ఉంటే నివృతి చేసుకోవాలి.. అవసరమనుకుంటే న్యాయ సలహా తీసుకోవాలన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణా ప్రభుత్వ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. చీఫ్ సెక్రటరీ లక్ష్యంగా గవర్నర్ వ్యవహరించడం సరికాదు..బిల్లుల విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ సూచించిన పద్ధతులను ఆవులంబిస్తుంటే.. గవర్నర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news