మంత్రి కొండా సురేఖ లాయర్ వివాదాస్పద కామెంట్స్.. పడుకో అని అనలేదంటూ!

-

అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రిపై హీరో నాగార్జున వేసిన డీఫమేషన్ కేసు విచారణలో ఉన్నది. అయితే, తన క్లైయింట్ ఎటువంటి తప్పుడు కామెంట్స్ చేయలేదని, అసలు ఈ కేసులో వేసిన పరువునష్టం దావా టెక్నికల్‌గా నిలబడదని కొండా సురేఖ లాయర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి.

అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సమర్థించే క్రమంలో ఆమె లాయర్ నోరు జారారు.‘సురేఖ ఎక్కడా పడుకో అనలేదు. అసభ్యకరంగా మాట్లాడలేదు. నాగార్జున కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఆమె ఏం మాట్లాడలేదు. దీనిపై డిఫమేషన్ వేయడం జోకింగ్ గా ఉంది. ఈ కేసులో సురేఖ కచ్చితంగా గెలుస్తారు’ అని ఆమె లాయర్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version