Breaking : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు.. టీఆర్‌ఎస్‌ నేతలకు కేటీఆర్‌ కీలక సూచన

-

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారం దుమారం రేపుతోంది. అయితే ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తన టీఆర్‌ఎస్‌ నేతలకు గురువారం ఓ కీలక సూచన చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై పార్టీకి చెందిన నేతలెవరూ మీడియాతో మాట్లాడవద్దని సూచించారు కేటీఆర్. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున పార్టీ నేతలంతా సంయమనం పాటించాలని సూచించారు కేటీఆర్.

 

ఈ మేరకు గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు కేటీఆర్. ”ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version