మహేష్ బాబును పరామర్శించిన మంత్రి కేటీఆర్

-

మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్య సమస్యలతో మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే..ఇందిరా దేవి కన్నుమూయడంతో ఆమె మనవరాలు, మహేష్ బాబు కూతురు సితార తట్టుకోలేకపోతోంది.

ఇంద్రాదేవి భౌతిక కాయం వద్ద మహేష్ పై కూర్చొని నానమ్మను గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. ఇది ఇలా ఉండగా ఈ తరునంలోనే ప్రిన్స్‌ మహేష్ బాబును పరామర్శించారు మంత్రి కేటీఆర్.

జూబ్లీహీల్స్‌ లోని మహేష్‌ బాబు ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. ఆయన తల్లి మృతదేహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news