క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరైన మంత్రి పిఏ, వ్యాపారవేత్తలు

-

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) దూకుడు పెంచింది. ఈడీ విచారణతో రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చికోటి ప్రవీణ్ విదేశాలలో క్యాసినో ఆడించినట్లు గుర్తించిన అధికారులు.. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

దీంతో విచారణలో వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి మంత్రి తలసాని బ్రదర్స్ ను విచారించిన ఈడీ.. ఇప్పుడు మంత్రి తలసాని పిఏ హరీష్ ను విచారించనుంది. మంత్రి పిఏ హరీష్ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలతో హరీష్ నేడు ఈడి ముందు హాజరుకాగా.. ఇదే కేసుకు సంబంధించి వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి కూడా బ్యాంకు స్టేట్మెంట్లతో విచారణకు హాజరయ్యారు. బుచ్చిరెడ్డి షాపూర్ నగర్ లో పలు వ్యాపారాలు చేస్తుంటాడు. వీరే కాక మరి కొంతమంది వ్యాపారవేత్తలు కూడా నేడు ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news