ప్రాపర్టీ రేట్‌లో దిల్లీని మించిన హైదరాబాద్‌.. తాజా నివేదికలో తెలిన విషయం..!!

-

హెదరాబాద్‌లో లైఫ్‌లో ఎంతోమంది ఇష్టపడతారు.. అటు సిటీ కల్చర్‌ ఉంటుంది.. ఇటు సొంతూర్లో ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. హెదరాబాద్‌లో సొంతిళ్లు ఉండటం అంటే కొండంంత బలం ఉన్నట్లే.. ఏడాదికి ఏడాది ఇక్కడ ల్యాండ్‌ రేట్లు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన సగటున 6 శాతం పెరిగాయని క్రెడాయ్ కొలీర్స్‌, లియాసెస్‌ ఫొరాస్‌ నివేదిక పేర్కొంది. దిల్లీ ఎన్‌సీఆర్‌తో పోలిస్తే హైదరాబాద్‌లోనే చదరపు గజం ధర ఎక్కువగా ఉండటం విశేషం. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లో పెరిగిన ధరల వివరాలను నివేదికలో తెలిపారు.

గతేడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి దిల్లీ ఎన్‌సీఆర్‌ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ ధరలు ఏకంగా 14 శాతాని ఎకబాకాయి. నగరంలోని గోల్ఫ్ కోర్స్‌ రోడ్‌లో 21 శాతం పెరగ్గా గాజియాబాద్‌ తర్వాతి స్థానంలో నిలించింది. కోల్‌కతా, అహ్మదాబాద్‌లోనూ ఇదే ట్రెండ్‌ కనిపించింది.. వార్షిక ప్రాతిపదికన వరుసగా 12%, 11% పెరిగాయి. విచిత్రంగా ముంబయి, చెన్నై నగరాల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

దేశవ్యాప్తంగా స్థిరాస్తి మార్కెట్‌ రికవరీ అవుతోంది. ధరల్లోనూ వృద్ధి కనిపిస్తోంది. కొవిడ్‌ తర్వాత సొంత ఇళ్లు ఉండాలన్న సెంటిమెంటు ప్రజల్లో బాగా పెరిగింది.. ఇవన్నీ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదం చేస్తున్నాయిని క్రెడాయ్‌ నేషనల్‌ అధ్యక్షుడు హర్ష వర్దన్‌ పటోడియా తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు పండగల జోష్‌ కొనసాగుతుంది. అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు హర్ష అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇక్కడా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. సొంతిటి కల నేరవేర్చుకొనేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ముంబయి మెట్రో రీజియన్‌లో అన్‌సోల్డ్‌ ఇన్వెంటరీ పెరగ్గా బెంగళూరులో పడిపోయింది.. వార్షిక ప్రాతిపదికన ముంబయిలో అమ్మకం కాని ఇళ్లు 21శాతం పెరిగాయి. కాగా ఎనిమిది నగరాల్లో కొత్త ప్రాజెక్టులు 39 శాతం పెరిగాయి. మూడో త్రైమాసికంలో బెంగళూరులో అమ్ముడు పోని ఇళ్లు 14 శాతానికి పడిపోయాయి. 6 శాతం ధరలు పెరిగినా విక్రయాలు పెరగలేదు..ముంబయి నగరంలో చదరపు గజం సగటు ధర రూ.19,485గా ఉంది. హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ చదరపు గజం ధర రూ.9,266గా ఉంది.

ఈ త్రైమాసికంలో ధర ఒక శాతం తగ్గగా గతేడాదితో పోలిస్తే 8 శాతానికి పెరిగింది. పూణె, బెంగళూరు చదరపు గజం ధర రూ.8000, దిల్లీ, చెన్నైలో రూ.7500, అహ్మదాబాద్‌లో రూ.6000గా ఉన్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఫ్లాట్‌ తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. కాస్త కష్టమైనా ఇప్పుడే స్టెప్‌ తీసుకోండి. కొన్ని ఏళ్లు అయితే హెదరాబాద్‌లో ఇళ్లు కొనాలనే కల కలగానే మిగలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news