ఓసారి కేటీఆర్ ఏపీ వస్తే చూపిస్తా : మంత్రి రోజా

-

ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్‌ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌ అనేక మార్పులు తీసుకొచ్చారని మంత్రి రోజా అన్నారు. ఏపీ గురించే కేటీఆర్‌ మాట్లాడితే.. ఆ వ్యాఖ్యలను ఆమె ఖండిస్తానని వెల్లడించారు. కేటీఆర్ ఏపీకి వస్తే దగ్గర ఉండి అభివృద్ధి చూపిస్తానన్న మంత్రి రోజా.. తమిళనాడు వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ సచివాలయాలను తీసుకువచ్చారన్నారు.

Roja counter to ktr Archives - Vaartha

అవినీతికి తావు లేకుండా పథకాలు అందుతున్నాయని ఆమె వెల్లడించారు. కేటీఆర్ కి చెప్పిన ఫ్రెండ్ ఎవరో.. తప్పుగా చెప్పరని భావిస్తున్నానని.. ఏపీకి వస్తే కేటీఆర్.. తెలంగాణలో ఇలాంటి పనులు చేయాలని అనుకుంటారని.. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పథకాలకు అందిస్తున్నాం అని వెల్లడించారు. ఇక, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయని, పక్కన ఉండే వారి మాటలు వింటే ఇబ్బందే ఉంటుందన్నారు. పక్క రాష్ట్రం గురించి మాట్లాడితే మనోభావాలు దెబ్బ తింటాయని మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news