జబర్దస్త్‌ లో అయిపోయింది..ఇక రాజకీయాల్లో ఇక నవ్వులు పూయిస్తా -మంత్రి రోజా

-

కడపజిల్లా : జబర్దస్త్‌ లో అయిపోయింది..ఇక రాజకీయాల్లో ఇక నవ్వులు పూయిస్తానని మంత్రి రోజా పేర్కొన్నారు. కడప, ఇడుపులపాయల లో పర్యటించారు పర్యాటక శాఖామంత్రి ఆర్.కె.రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ నాకు దేవుడు.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని కొనియాడారు. అందుకే ఆయన ఆశిస్సుల కోసమే ఇడుపులపాయ సందర్శన అని… ఆయనకు నివాలర్పించాలనే కడపకు రావడం జరిగిందని చెప్పారు.

టీడీపీ లో ఉన్నప్పుడు వైఎస్ నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని.. ఎమ్మెల్యే కావాలనేది నాకల అని… కల నెరవేరింది.. మంత్రిని కూడా అయ్యానన్నారు. పదవులు ఇచ్చేటప్పుడు కులాలు గుర్తుకువస్తాయా అని… వైసీపీ కోసం సైనికుల్లా పని చేస్తానని స్పష్టం చేశారు.

జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను..గతంలో ఓంటిమిట్ట రధోత్సవానికి వచ్చినప్పుడు జగన్ ను సీఎం చేయాలని వేడుకున్నానని స్పస్టం చేశారు. తన కోరిక నెరవేర్చినందుకు మరోమారు కళ్యాణోత్సవానికి హజరవుతున్నానని.. ఆర్థిక పురోగతి సాధించే విధంగా పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news