ఈడీ విచారణకు హాజరైన మంత్రి తలసాని పిఎ

-

క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ పలువురిని విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను కూడా ఈడి అధికారులు విచారించారు.

ఈ క్రమంలోనే నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడు అశోక్ ని ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. క్యాసినో కేసులో విచారణకు హాజరు కావలసిందిగా అశోక్ కు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఇడి సూచించిన బ్యాంకు పత్రాలను అశోక్ తన వెంట తీసుకొని విచారణకు హాజరయ్యారు. ఫెమ నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news