తెలంగాణలో కలకలం.. మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీలో కరోనా కలకలం సృష్టించింది. 4 రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ జరిగింది. ఆయన రెండు రోజుల కింద కరోనా పరీక్షలు నిర్వహించుకోగా నిన్న రిపోర్టులు వచ్చాయి. అందులో కరోనా పాజిటివ్ రావడంతో మిర్యాలగూడలోని తమ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది.

 

అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news