నన్ను చంపేస్తారట.. డీజీపీకి రాజాసింగ్‌ లేఖ

-

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆయన రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు లేఖ రాశారు. తనకు ప్రాణహాని ఉందని.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ.. రాజాసింగ్.. డీజీపీ అంజనీకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. గత కొన్ని నెలల నుంచి ఇలాంటి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు.ఈ విషయం పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజాసింగ్ ఆరోపించారు.

తనతో పాటు, తన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఆగంతకులు చెబుతున్నారని… రోజువారీ కార్యకలాపాలు గురించి చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజాసింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని… త్వరలో నీ అంతు చూస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని… డీజీపీకి రాసిన లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. ఆగంతకులు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్లు, సందేశాలను డీజీపీకి పంపించారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా… ఫలితం లేదని రాజాసింగ్ అన్నారు. గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా.. గతంలో నేరచరిత్ర ఉందని నిరాకరిస్తున్నారన్నారు. ఎంతో మంది నేరస్థులకు సైతం గన్ లైసెన్సులు ఇచ్చారని రాజాసింగ్ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news