రాజాసింగ్ కు కరోనా నెగిటివ్.. అంతా వారి దయేనట..!

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. ఇటీవల అతని గన్ మెన్‌కు పాజిటివ్ రావడంతో.. ఆయన ఫ్యామిలీతో సహా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయగా రాజాసింగ్, కుటుంబసభ్యులకు నెగిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా రాజాసింగ్ స్పందిస్తూ… శ్రీరాముడు, గోమాత దయతో తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిందని చెప్పారు. తన క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికి కృతజ్ఞతలు చెపుతున్నానని పేర్కొన్నారు.

రాజాసింగ్ డ్రైవర్ కు కరోనా నిర్దారణ అవ్వడంతో ఆయనను కలిసిన కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆయనకు నెగిటివ్ రావటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్ నేతలు దీని బారిన పడగా.. కొంతమంది నాయకులు హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news