ఎమ్మెల్యే రోజా పగని నిమ్మగడ్డ తీర్చారా

-

పార్టీ అధికారంలో లేనప్పుడు టీడీపీ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఎమ్మెల్యే రోజా..ఇక పార్టీ అధికారంలోకి రావడంతో తిరుగులేదనుకున్నారు. కానీ సొంత పార్టీలోనే రోజా స్పీడుకి బ్రేకులేసే నాయకులు ఎక్కువయ్యారట. జిల్లాలోని ఇద్దరు మంత్రులతోను రోజాకి తగువు నడుస్తుంది. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదంటూ ఓపెన్‌గానే ఫైర్‌ అవుతున్నారు రోజా ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాం చిత్తూరు కలెక్టర్ కి ఎర్త్ పెట్టడంతో దీనిపైనే జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుందట…

నగరి నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన ఎమ్మెల్యే రోజాకి సొంత పార్టీలోనే సమస్యలు ఎక్కువయ్యాయట. చిత్తూరు జిల్లాలో మొదట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పేచీ. తర్వాత డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో తగువు. వైసీపీ అధిష్ఠానం ఈ విభేదాలను సర్దుబాటు చేసిందని అనుకుంటున్న సమయంలో.. శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ముందు రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో సొంతపార్టీ నేతలపై కాకుండా జిల్లా కలెక్టరు భరత్ గుప్తాపై బాణం ఎక్కుపెట్టారు రోజా.

నగరి అసెంబ్లీ పరిధిలోకి వచ్చే పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించిన సమాచారం రోజాకు ఇవ్వలేదట. దీంతో కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. కనీస మర్యాద ఇవ్వడం లేదని ఎప్పటి నుంచో ఆమె గుర్రుగా ఉన్నారు. తనకు తెలియకుండానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులతో నగరిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. సమాచారం ఇవ్వడం లేదని రోజా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఎమ్మెల్యే రోజా మధ్య కొన్నాళ్లు మాటల తూటాలు పేలాయి. పార్టీ పెద్దల జోక్యంతో రెండువర్గాలు కామయ్యాయి. ఇంతలోనే నగరి పరిధిలోని టీటీడీకి చెందిన 6వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అట్టహాసంగా జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించి రోజాకు సమాచారం ఇవ్వలేదట.

ఈ ఘటనతో ఎమ్మెల్యే మనస్తాపం చెందారట. రోజా APIIC చైర్మన్‌ కూడా అయినా తనకి ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెర వెనక ఎవరున్నా.. సమాచారం ఇవ్వాల్సిన కలెక్టర్‌కు ఏమైందని ఫైర్‌ అవుతున్న రోజా.. ఆయనపై ఏకంగా అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్దన్‌రెడ్డి స్వయంగా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి.. మళ్లీ అలాంటివి జరగకుండా చూడాలని చెప్పారు. దానికి ఆయన ఓకే అన్నారు.

ఇలా కలెక్టర్ పై రోజా ఫిర్యాదు చేసిందో లేదో అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి కలెక్టర్ పై వేటు పడింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ కలెక్టర్ ని బదిలీ చేయడంతో రోజా పగని నిమ్మగడ్డ తీర్చారా అన్న చర్చ జిల్లా రాజకీయాల్లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news