గద్దర్‌ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు : ఎమ్మెల్సీ కవిత

-

ప్రజాగాయకుడు గద్దర్‌ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  అన్నారు. జన నాట్యమండలి స్థాపించి జనం కోసం గొంతెత్తి, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడని పేర్కొన్నారు. ప్రజాయుద్ధనౌక గద్దర్‌ నిష్క్రమణ తీరని లోటని అన్నారు. భౌతికంగా దూరమైనా గద్దర్‌ జ్ఞాపకాలు పాటల రూపంలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని వెల్లడించారు. ‘పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా’ జోహర్‌ గద్దర్‌ అంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

అలాగే.. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ తన జీవితంలో పాటను తూటాలా పేల్చి ప్రజలను ఉర్రూతలూగించారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన మరణం తీరని లోటని దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్‌ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, తుది శ్వాస వరకు ప్రజల కోసమే బతికిన గొప్ప సంస్కృతిక సేనాని అని కొనియాడారు. ఆయన పాట స్ఫూర్తితో తెలంగాణలో ఎందరో కళాకారులు, గాయకులు వచ్చారని తెలిపారు. ప్రపంచం ఒక గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news