ప్రధాని మోదీ పిలుపు: “హనుమాన్” లాగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలి…

-

ఈ రోజు దేశవ్యాప్తంగా హనుమాన్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుతున్నారు. ఇక ఇదే రోజున బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం కూడా కావడం విశేషం. ఈ రోజున దేశ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలు అందరికీ దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఈ రోజు ఇంతటి స్థాయిలో ఉంది అంటే దానికి కారణం ఎందరో గొప్ప నేతల త్యాగాల ఫలితమే అన్నారు. హనుమాన్ ఎలాగయితే తాను ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా సాధించి తీరుతాడో, అదే విధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కలిసి కష్టపడి పనిచేయాలని మోదీ సూచించారు.

మీరు అనుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదంటూ వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. ఈ రోజు నుండి భారతదేశానికి ప్రజాస్వామ్యం ఎంత ముఖ్యమో తెలుసు.. మీరందరూ రాజ్యాంగాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వెయ్యాలి అంటూ మోదీ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news