గుజరాత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మోదీ

-

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మొత్తం 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ ప్రారంభమయ్యింది. 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.54 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందుకోసం 26, 409 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

అయితే, గుజరాత్ రెండో దశ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని నిశాన్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఇతర ఓటర్లతో కలిసి క్యూలో వెళ్లి మోదీ ఓటు వేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు దేశంలో మరో ఐదు నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతుండగా, ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మోదీ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news