రైతులను అవమానించారు.. మోడీ ఆగ్రహం..?

-

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటనపై స్పందిస్తూ మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ… రైతులను అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు దైవంగా పూజించుకునే యంత్రాలు పరికరాలకు నిప్పంటించి దారుణ చర్యలకు పాల్పడ్డారు అంటూ విమర్శించారు నరేంద్ర మోడీ. ఢిల్లీలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకారులు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద.. ట్రాక్టర్ కి నిప్పంటించిన విషయం తెలిసిందే.

ఈ ఘటన సంచలనంగా మారగా.. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటన పై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఉత్తరాఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన నరేంద్ర మోడీ ఢిల్లీ ఘటనను గురించి మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. రైతులు కార్మికులు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చాము అంటూ తెలిపిన నరేంద్ర మోడీ… ఇది ప్రతి ఒక్కరిని అవి బలోపేతం చేస్తాయి అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news