రాజమాత గౌరవార్థం వందరూపాయల నాణేన్ని విడుదల చేసిన మోడీ..

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ వంద రూపాయల నాణేన్ని విడుదల చేసారు. రాజమాత సింధియా గౌరవార్థం వందరూపాయల నాణేన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలీజ్ చేసారు. రాజమాత సింధియా శతజయంతి సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నాణేన్ని విడుదల చేసింది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజమాత సింధియా జన్ సంఘ్ నేతగా పనిచేసారు.

వంద రూపాయల నాణేన్ని విడుదల చేసిన తర్వాత ప్రధాని మాట్లాడుతూ, ఇతరులకి సేవ చేయడానికి రాజకుంటుంబంలో పుట్టాల్సిన అవసరం లేదని, కావాల్సిందల్లా దేశంపై ప్రేమ, ప్రజాస్వామ్య స్వాభాలేనని.. వీటిని రాజమాత సింధియా గారి నుమ్డి మేము తెలుసుకున్నామని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news