మోడీ శ్రీలంక టూర్ ఎఫెక్ట్‌.. భారత మత్స్యకారుల విడుదల

-

ప్రధాని నరేంద్రమోడీ శనివారం శ్రీలంకలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదేశ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అనంతరం ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్య, పరస్పర సహకారంపై కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ క్రమంలోనే శ్రీలంక నేవీ పట్టుకున్న భారత జాలర్లను విడుదల చేయాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ క్రమంలోనే పట్టుబడిన జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. నిన్న ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా మానవతా దృక్పథంతో మత్స్యకారుల విడుదలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.ఈ మేరకు శ్రీలంక 11 మంది భారత జాలర్లను విడుదల చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news