చెత్త నా కొడుకులు రాజకీయం చేశారు : పేర్ని నానితో భేటీపై మోహన్ బాబు సంచలనం

-

చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయిన అంశం పై మంచు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని.. ఈ జన్మకు వద్దని అనుకుంటున్నానన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్‌ మోహన్‌ రెడ్డి నాకు బంధువులు కాబట్టి గతంలో ప్రచారం చేశాను… చంద్రబాబు నాయుడుకి చేసినట్లు జగన్‌కూ ప్రచారం చేయాలి కాబట్టి చేశామని వెల్లడించారు.

అది అక్కడితో అయిపోయిందని… ఇప్పుడు నేను సినిమాలు, యూనివర్శిటీ పనులతో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని అనుకుంటున్నాను’’ అని మోహన్‌బాబు అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ విడుదల సందర్భంగా మోహన్‌బాబు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు.

ఇండస్ట్రీకి సంబంధించిన చర్చలు, సమస్యల గురించి ఆయన స్పందించను అన్నారు. మంత్రి పేర్ని నాని ఆయన్ను కలవడానికి కారణాలను వెల్లడించారు. ‘‘ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు స్నేహితులు, బంధువులు ఉన్నారు. ఏపీ మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉంది. ఇటీవల ఇద్దరం ఓ పెళ్లిలో కలిశాం” అని చెప్పారు మోహన్ బాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news