Breaking : వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్ కుమారుడు పోలీసుల అదుపులో..

-

హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ లో బాలిక‌పై జ‌రిగిన గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు చ‌ర్యలు చేపట్టారు. ఈ
ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన జూబ్లీ హిల్స్‌ పోలీసులు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ కేసులో బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ మ‌సివుల్లా ఖాన్ కుమారుడు మ‌హ్మ‌ద్ ఖాద‌ర్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌హ్మద్ ఖాద‌ర్ ఖాన్‌తో పాటు మ‌రో మైన‌ర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Hyderabad: 5 including 3 Nigerians arrested for cheating

ఈ కేసులో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీజేపీ శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన సంగ‌తి
తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి దూసుకెళ్లడంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అయితే అప్ప‌టికే కేసుపై దృష్టి సారించిన పోలీసులు నిందితుల క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మ‌హ్మ‌ద్ ఖాద‌ర్ ఖాన్ హైద‌రాబాద్ శివారులో ఉన్న‌ట్లు గుర్తించి అత‌డితో పాటు మ‌రో మైన‌ర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news