పోలీసు వాహనాల్లో డబ్బులను తరలిస్తున్నారు – ఈటల రాజేందర్

-

సోమవారం మునుగోడు బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా చండూరులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహ ప్రబారి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నిమునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు పంచి పెడుతున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ నాయకులు పోలీసుల వాహనాలలోనే డబ్బులను తరలిస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు లో తిష్ట వేశారని.. వారంతా ఇక్కడి ప్రజలను రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news